AP: రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 48 గంటల్లో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో వేస్తామని, గతేడాది కంటే రూ.3500 కోట్లు అదనంగా ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. అంచనాలకు మించి సూపర్ఫైన్ రకం ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా 40వేల పాఠశాలు, 4 వేల వసతిగృహాలకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. రేషన్ బియ్యంలోనూ నాణ్యత పెంచుతామని ఆయన పేర్కొన్నారు.