వడ్డాది కొత్తూరులో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో ఏడో రోజు ఆదివారం అమ్మవారు చండి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భక్తుల తాతయ్య బాబు తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భవాని మాలదారులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొత్తూరు ప్రజలు, పెద్దల సహకారంతో భక్తులకు అన్నదానం జరిగింది.