నర్సీపట్నం ఎమ్మెల్యేల గ్రూప్ ఫోటోను సీఎంకి అందజేసిన స్పీకర్

అమరావతి శాసనసభ ప్రాంగణంలో శనివారం శాసనసభ్యులు తీసుకున్న గ్రూప్ ఫోటోను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణంరాజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ కార్యక్రమం స్పీకర్ కార్యాలయంలో జరిగింది. శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, చీఫ్ విప్ ఆంజనేయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని స్పీకర్ కార్యాలయం శనివారం సాయంత్రం తెలిపింది.

సంబంధిత పోస్ట్