అనంతపురం సాయినగర్లోని ఆపిల్ ఫంక్షన్హాల్ ప్రాంగణంలో శనివారం సీఐటీయూ 11వ జిల్లా మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. నర్సింగరావు మాట్లాడుతూ, కార్మిక రాజ్య స్థాపనతోనే సమాజానికి రక్షణ లభిస్తుందని, హక్కుల సాధనకు ఐక్య పోరాటాలే మార్గమని అన్నారు.