ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి శుక్రవారం ధర్మవరంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డిని కలిసి, అనంతరం క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సంఘటన ధర్మవరం రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.