మంగళవారం ధర్మవరం లో ఆర్డీవో మహేశ్ రాజకీయ పార్టీల నాయకులతో ఓటర్ల జాబితా ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ధర్మవరం నియోజకవర్గంలో మొత్తం 2,47,688 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 1,22,597 మంది పురుషులు, 1,25,069 మంది మహిళలు, 22 మంది ఇతరులు ఉన్నారని తెలిపారు. నియోజకవర్గంలో ప్రస్తుతం 295 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, త్వరలో మరో మూడు కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్డీవో వెల్లడించారు.