గ్రామ, వార్డుల వాలంటీర్ పనులను కార్యదర్శులు నిర్వహించడం తగదని ఐక్యవేదిక నేతలు పేర్కొన్నారు.హిందూపురంలో శనివారం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు వాలంటీర్ పనులను బహిష్కరించి మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేశారు. అసోసియేషన్ ప్రతినిధులు, నోషనల్ ఇంక్రిమెంట్లు, జాబ్చార్ట్, మాత శాఖ ద్వారా పర్యవేక్షణ విధానం అవసరమని, వాలంటీర్ బాధ్యతలు సచివాలయ ఉద్యోగులకు కేటాయించడంపై పునరాలోచన కోరారు.