నిమ్మనపల్లెలో పోలీస్ దంపతులపై కత్తితో దాడి

శుక్రవారం రాత్రి నిమ్మనపల్లె మండలంలోని తవళం గ్రామంలో పోలీస్ దంపతులపై కత్తితో దాడి జరిగింది. మదనపల్లె అగ్నిమాపక కేంద్ర హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, ఆయన భార్య భువనేశ్వరి తమ భూమిలో బోరు పనులు చేస్తుండగా, ప్రత్యర్థులు పుంగనూరు రెడ్డెప్ప, కొడుకు సతీష్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బాధితులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్