అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం మంగపేటలోని కటాపుటాలమ్మ తల్లి ఆలయంలో శనివారం రాత్రి హుండీ, బీరువాలు పగలగొట్టి విలువైన వస్తువులను దొంగిలించారు. దూర ప్రాంతాల నుంచి భక్తులు దర్శించుకునే ఈ గ్రామ దేవత ఆలయం చుట్టూ లైటింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.