కురబలకోట మండలం తెట్టు గ్రామానికి చెందిన సుమారు 30 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆదివారం జనసేన పార్టీలో చేరారు. ములకలచెరువులోని పార్టీ కార్యాలయంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాయినాథ్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జనసేన సిద్ధాంతాలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని, అందుకే పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.