ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం తయారీని అరికట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించడానికి ఒక మొబైల్ యాప్ను తీసుకురానున్నట్లు CM చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ యాప్ ద్వారా మద్యం బాటిల్పై ఉన్న హోలోగ్రామ్ను స్కాన్ చేస్తే అది అసలైనదా లేక నకిలీదా అని తెలిసిపోతుంది. ఈరోజు ఎక్సైజ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ వివరాలను వెల్లడించారు.