శ్రీశైలం మహాక్షేత్రం అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్

AP: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధిపై దేవాదాయ, అటవీశాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన దివ్యక్షేత్రంగా వెలుగొందుతోన్న ఆలయ సమగ్రాభివృద్ధిపై చర్చించారు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై సమీక్షించారు. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్