మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన భాగ్యరాజ్, పవన్ కుమార్, సుధాకర్లను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఈ కేసులో ఇప్పటివరకు 11 మంది అరెస్ట్ అయ్యారు. మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి.