చీరాల: జీఎస్టీ 2.0పై కిరాణా వ్యాపారులకు అవగాహన

చీరాలలో కిరాణా మర్చంట్ అసోసియేషన్ హాలులో శనివారం వాణిజ్య పనుల శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ 2.0పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీ యస్.కె.జమీర్ బాషా మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ సంస్కరణలను అమలు చేయడంలో వ్యాపారస్తులు సహకరించి ప్రజలకు ఫలాలు అందించాలని కోరారు. వాణిజ్య పనుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ ఆర్. శ్రీనివాసరావు ధరలు తగ్గించి వినియోగదారులకు వస్తువులు అందించాలని, తగ్గిన ధరల వివరాలను షాపుల ముందు బోర్డులపై ప్రదర్శించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్