AP: అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గనుల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉచిత ఇసుక విధానం, రాష్ట్రంలో మేజర్, మైనర్ ఖనిజాల ఆదాయ లక్ష్యాలు చర్చించబడ్డాయి. మంత్రి కొల్లు రవీంద్ర, శాఖ ఉన్నతాధికారులు ముఖేష్ కుమార్ మీనా, ప్రవీణ్ కుమార్, ఆర్టీజీ అధికారులు హాజరయ్యారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ₹3,320 కోట్ల ఆదాయ లక్ష్యం నిర్ధారించబడింది. ముఖ్యంగా మాంగనీస్ ఉత్పత్తిలో 72% అదనపు ఆదాయం రావచ్చని అధికారులు తెలిపారు.