నగరి నియోజకవర్గం, పుత్తూరు పట్టణంలో బుధవారం స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై పట్టణ కమిషనర్ మంజునాథ్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులు స్కేటింగ్ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఒకసారి వాడిన ప్లాస్టిక్ భావితరాల ఉనికిని దెబ్బతీస్తుందని, ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని కమిషనర్ తెలిపారు.