పలమనేరు బస్టాండ్ లో సీఐ మురళీమోహన్ సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్లోని టూ వీలర్ పార్కింగ్, దుకాణాలు, బస్ పాస్ కౌంటర్ పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మైక్ తీసుకుని దొంగలున్నారు జాగ్రత్త అంటూ పలు హెచ్చరికలు జారీ చేశారు. ప్రయాణికులు బస్సు ఎక్కేటప్పుడు తమ విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు.