కుప్పం మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని అర్చన రాష్ట్రస్థాయి యోగ పోటీలకు ఎంపికైంది. ఈ విషయాన్ని పాఠశాల హెడ్ మాస్టర్ సునీత తెలిపారు. శుక్రవారం అర్చనను అభినందించిన ఆమె, రాష్ట్రస్థాయి పోటీల్లో అర్చన గెలుపొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.