కుప్పం రెస్కోలో ఉద్యోగాలు కల్పిస్తామని కొంతమంది నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, రెస్కోలో ఉద్యోగాలు ఇస్తామన్న వారి మాటలు నమ్మి మోసపోవద్దని రెస్కో చైర్మన్ ప్రతాప్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రెస్కోలో అవసరానికి మించి ఉద్యోగ నియామకాలు చేపట్టారని, వాటిపై చర్యలు తీసుకునేందుకు పాలకవర్గం సన్నద్ధమైందని ఆయన తెలిపారు.