పుత్తూరు: ప్రజా సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే

నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మంగళవారం పుత్తూరు పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో ప్రజలతో సమావేశమయ్యారు. ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతోనూ చర్చించి, పుత్తూరులోని రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్