ఆదివారం రాత్రి ఒంగోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగవరం మండలంలోని పత్తికొండలో పనిచేసే జూనియర్ లైన్మెన్ చరణ్ మృతి చెందారు. విజయవాడలో జరిగే ధర్నాకు వెళుతుండగా, వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో చరణ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.