బంగారుపాళెంలో లారీ బోల్తా: డ్రైవర్, క్లీనర్ కు గాయాలు

శుక్రవారం రాత్రి బంగారుపాళెంలోని కాటప్ప గారి పల్లి సమీపంలో టైరు పేలడంతో లారీ బోల్తా పడింది. బెంగళూరు నుంచి చిత్తూరు వైపు వస్తున్న లారీ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్