పులిచెర్ల మండలంలో కొనసాగుతున్న ఏనుగుల దాడులు

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో ఏనుగుల గుంపు పంటలపై దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం దేవళంపేట పంచాయతీలో అమర్నాథ రెడ్డి, రవికుమార్ వంటి రైతుల వరి, మామిడి పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది ధ్వంసమైన పంటలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్