తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మంగళవారం మాట్లాడుతూ, ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ నివేదిక అందిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ర్యాగింగ్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జిల్లాలో ర్యాగింగ్కు ఆస్కారం లేదని స్పష్టం చేశారు.