తిరుమలలో మంగళవారం అర్థరాత్రి మొదటి ఘాట్ రోడ్డులో సుమారు 10 అడుగుల కొండచిలువ రోడ్డు దాటుతూ భక్తులకు కనిపించింది. దీనితో వాహనాల రాకపోకలు పది నిమిషాలపాటు నిలిచిపోయాయి. కొందరు భక్తులు భయాందోళనకు గురయ్యారు. కొద్ది సేపటి తర్వాత కొండచిలువ అడవిలోకి వెళ్లిపోయింది.