తిరుపతి: డ్రైవర్లపై నిరంతర పర్యవేక్షణ అవసరం

తిరుపతిలో మంగళవారం స్కూల్ యాజమాన్య ప్రతినిధులతో సమావేశమైన జిల్లా రవాణా శాఖ అధికారి మురళి, విద్యాసంస్థల యాజమాన్యాలు తమ బస్సు డ్రైవర్లపై నిరంతర పర్యవేక్షణ కలిగి ఉండాలని సూచించారు. డ్రైవర్ల ప్రవర్తన నియంత్రణ, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగ నిషేధం, రోడ్డు నియమాల పాటించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. విద్యార్థుల ప్రాణ భద్రతను నిర్లక్ష్యం చేసే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్