మల్లవరం హైవేపై రెండు కార్లు ఢీ

మంగళవారం రాత్రి తిరుపతి రూరల్ సి.మల్లవరం హైవే జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి తమిళనాడు వెళ్తున్న ఇన్నోవా కారు, పీలేరు వైపు వస్తున్న మరో కారు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హైవే సిబ్బంది, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్