AP: సీఎం చంద్రబాబు లండన్లో పర్యటిస్తున్నారు. లండన్లో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామిని సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. యూకేలోని వివిధ వర్సిటీలు ఏపీతో 4 అంశాల్లో భాగస్వామ్యం ఏర్పాటు చర్చించారు. ఏపీలో యూనివర్సిటీ కేంద్రాలను ప్రారంభం, కేంద్ర సహకారంతో జాయింట్ వెంచర్లు ఏర్పాటు, వర్సిటీలు, విద్యాసంస్థల మధ్య విద్యార్థుల ఎక్స్ఛేంజ్ వంటి అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు.