AP: పార్టీ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారిపై ‘డిజిటల్ బుక్’లో ఫిర్యాదు చేయాలని వైసీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే డిజిటల్ బుక్ వల్ల వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినీపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేశారు. 2022లో చిలకలూరిపేటలోని తన ఇంటిపై దాడి చేయించారని, తనపై చర్యలు తీసుకోవాలని కోరారు.