AP: కూటమి పాలనలో అన్యాయానికి గురైన వైసీపీ కార్యకర్తల కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్ డిజిటల్ బుక్ అందుబాటులోకి తీసుకొచ్చారని మాజీ మంత్రి రోజా స్పష్టం చేశారు. సోమవారం నగరిలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ను ఆవిష్కరించారు. వైసీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. చంద్రబాబు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని, 15 నెలలుగా అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు.