డ్రోన్ తో నిఘా.. మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటున్న యువకుల పట్టివేత

టెంపుల్ సిటీ తిరుపతిలో పోలీసుల డ్రోన్ నిఘా కొనసాగుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాలపై డ్రోన్ సర్వైలెన్స్‌ జరుగుతోంది. ఈ క్రమంలో డ్రోన్ ద్వారా ఇద్దరు యువకులు మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి మత్తు ఇంజెక్షన్లు, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదైంది. యువత మత్తు పదార్థాల మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

సంబంధిత పోస్ట్