జేసీ, జిల్లా జీఎస్టీ నోడల్ అధికారి వై. మేఘ స్వరూప్,జీఎస్టీ సంస్కరణల మూలంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేకూరే మేలును వివరించే విధంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా అధికారులకు సూచించారు. శనివారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ దిశానిర్దేశం చేశారు. నెల రోజులపాటు 'సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్' పేరిట ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన వెల్లడించారు.