కాకినాడ: అన్న క్యాంటీన్ నిర్వహణపై నగర కమిషనర్ ఆగ్రహం

నగరపాలక సంస్థ కమిషనర్ సుధాకర్ సోమవారం కాకినాడలోని అన్నమ్మ ఘాట్ సెంటర్ అన్న క్యాంటీన్ను సందర్శించారు. పేద ప్రజలు భోజనానికి వచ్చే ఈ క్యాంటీన్లలో పరిశుభ్రత లోపించడంపై ఆయన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంటీన్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని ఆదేశించారు. అన్న క్యాంటీన్లు పరిశుభ్రతకు మారుపేరుగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్