ఆలమూరు: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తికి తీవ్రగాయం

ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రాజుపాలెం నుంచి రాజమహేంద్రవరం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో తలకు గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో హైవే సేఫ్టీ వాహనం, అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకొని, హైవే సేఫ్టీ సిబ్బంది సహాయంతో క్షతగాత్రుడిని రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్