సామర్లకోట - వేట్లపాలెం రోడ్డులో అనుమానాస్పదంగా వెళ్తున్న లారీని రెవెన్యూ, వ్యవసాయ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో సమాచారం అందడంతో సామర్లకోట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఏడీఈ దుర్గా లక్ష్మీ, ఏవో మురళీధర్ లారీని ఆపగా, డ్రైవర్ పరారయ్యాడు. లారీలో కొన్ని బస్తాలు గుర్తించారు. అవి పొటాషియం అయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పోలీసులకు వాహనాన్ని అప్పగించి, లారీలోని సరుకును ల్యాబ్కు పంపించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.