బుట్టాయిగూడెం మండలం కొమ్ముగూడెంలో వ్యవసాయ కూలీ దుర్గయ్య, ఒక రైతు పొలంలో ట్రాక్టర్తో దున్నుతుండగా, ట్రాక్టర్ పైనున్న విద్యుత్ తీగలకు తగిలి షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ ప్రాంతంలో విద్యుత్ తీగలు చాలా తక్కువ ఎత్తులో ఉండటమే ఈ దుర్ఘటనకు కారణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేస్తున్నారు.