జీలుగుమిల్లి: ట్రాక్టర్ పై నుంచి పడి వ్యక్తి మృతి

మంగళవారం జీలుగుమిల్లి మండలం సిర్రివారిగూడెంలో ట్రాక్టర్ అదుపుతప్పి కింద పడి అఖిల్ అనే యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీలుగుమిల్లి ఎస్‌ఐ క్రాంతికుమార్ ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్