జిలుగుమిల్లి మండలం రమణక్కపేట వద్ద ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనడంతో కోయిదా గ్రామానికి చెందిన కాకాని రవి (35) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ మెకానిక్గా పనిచేస్తున్న రవికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.