తుఫాను కారణంగా ఉంగుటూరు మండలంలో ప్రాథమిక అంచనాల ప్రకారం 2,645 ఎకరాల పంట నీట మునిగి, నేలకొరిగింది. ఆరుగాలం శ్రమించి చేతికి వచ్చిన పంట ఆకాల వర్షానికి నష్టపోవడంతో కౌలు రైతులు రామారావు, సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. నేలకొరిగిన పొలాలను చూసి కంటతడి పెట్టుకుంటూ, దిగుబడులు తగ్గిపోతాయని వారు ఆందోళన చెందారు.