సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు అసెంబ్లీ వేదికగా మాట్లాడాలని జనసేన ప్రజాప్రతినిధులకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించారు. సమష్టిగా అసెంబ్లీలో చర్చించి ఓ చట్టం తీసుకువచ్చేలా పనిచేద్దామన్నారు. విశాఖలో గురువారం జరిగిన జనసేన లెజిస్లేటివ్ సమావేశంలో పవన్ పాల్గొన్నారు. ప్రభుత్వంపైనా, పాలనలో ఉన్న వారిపైనా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.