AP: రాజమండ్రి, తిరుపతి మధ్య విమాన సర్వీసులను అక్టోబర్ 1 నుంచి ప్రారంభిస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలిపారు. అక్టోబర్ 1న ఉదయం 09:25 గంటలకు తిరుపతి నుంచి రాజమండ్రి చేరుతుందన్నారు. తిరిగి ఉదయం 10:15 గంటలకు రాజమండ్రి నుంచి తిరుపతి బయల్దేరుతుందని తెలిపారు. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని కేంద్రమంత్రి తెలిపారు.