AP: అమరావతిలోని SRM కాలేజీలో సోమవారం ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత 300 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాలేజీ యాజమాన్యం ఈ విషయాన్ని బయటకు రాకుండా కప్పిపుచ్చడానికి ప్రయత్నించినట్లు, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను బెదిరించినట్లు సమాచారం.