AP: కడప జిల్లా ప్రొద్దుటూరులోని మున్సిపల్ ఆఫీస్ ఎదుట మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బుధవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఎగ్జిబిషన్ లీజు మొత్తాలను వెంటనే వసూలు చేయాలని డిమాండ్ చేశారు. వేలంలో ఎగ్జిబిషన్ టెండర్ దారుడు నుంచి రూ.కోటి బకాయిలను వసూలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఖజానాకు బకాయిలు వసూలయ్యే వరకు పోరాటం కొనసాగిస్తానన్నారు.