ఏపీలో ఉచిత బస్సు పథకం.. మరో గుడ్‌న్యూస్!

AP: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 'స్త్రీ శక్తి పథకం' విజయవంతంగా అమలవుతోందని తెలిపారు. ఈ పథకానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు, ప్రభుత్వం కొత్తగా 1,500 బస్సులు కొనుగోలు చేయడంతో పాటు, 750 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చామన్నారు. ఈ 750 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో విశాఖ, కాకినాడ, VJD, GNTR, తిరుపతి నగరాల్లో తిరుగుతాయి. అదనంగా మరో 1,500 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టే ప్రణాళిక ఉందని, పాత బస్సుల స్థానంలో దశలవారీగా ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తామని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్