AP: మంత్రి నారాయణ బుధవారం ఏలూరు జిల్లాలోని పోణంగిలో టిడ్కో గృహాల సముదాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో 160 ప్రదేశాలలో టిడ్కో గృహాల సముదాయాలను నిర్మిస్తున్నామన్నారు. 2026 మార్చి, జూన్ నాటికి మిగిలిన ఇళ్లను పూర్తిచేసి, లబ్దిదారులకు అందజేస్తామన్నారు. టిడ్కో ఇళ్ల కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని' అధికారులకు సూచించారు.