AP: విశాఖపట్నంలో నిర్వహించిన సేనతో సేనా కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దశాబ్ద కాలం తనకు టైమ్ ఇస్తే.. కార్యకర్తలను నాయకులుగా, దేశ నిర్మాణంలో కీలక వ్యక్తులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని అన్నారు. దేశ నిర్మాణం కోసం, దేశ బలోపేతం కోసం కలిసి అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. అయితే రాజకీయాల కోసం తాను కుటుంబాన్ని కూడా విస్మరించారని వెల్లడించారు.