ప్రపంచవ్యాప్తంగా జరిగే రోడ్డు ప్రమాదాలలో 10శాతం పైగా భారతదేశంలో జరుగుతున్నాయని సామాజికవేత్త భాను ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణ తేజను చిలకలూరిపేటలో కలిశారు. ఇటీవల చేవెళ్లలో జరిగిన టిప్పర్-బస్సు ప్రమాదం, కర్నూలు బస్సు దహనం వంటి ఘటనల్లో 20 మంది మరణించారని ఆయన గుర్తుచేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన నియంత్రణలు విధించాలని ఆయన కోరారు.