గురువారం పెదనందిపాడు వద్ద నల్లమడ వాగును పరిశీలించిన డ్రైనేజి డీఈ మల్లికార్జునరావు, తుఫాన్ ప్రభావంతో వాగులో 35వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని, ఇది 25వేల క్యూసెక్కుల సామర్థ్యం కంటే అధికమని తెలిపారు. వాగులో నీరు తగ్గిన తర్వాత గండ్లను పూడ్చివేస్తామని, నల్లమడ మోడరన్ డ్రైన్ నిర్మాణానికి రూ. 370 కోట్లతో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని పేర్కొన్నారు. ఉదయం నుంచి నీటి మట్టం 4 అడుగులు తగ్గిందని ఆయన వెల్లడించారు.