AP: వైసీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టు అనుమతితో 15 నెలల తరువాత శనివారం ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తానన్నారు. గత 15 నెలలు వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారని కేతిరెడ్డి ఆరోపించారు. వారి ఇంటికి వెళ్ళి ఓదార్చుతానని పేర్కొన్నారు. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు.