మదనపల్లెలో గొడవను అడ్డుకున్న యువకుడిపై దాడి

మదనపల్లెలో చీటీ డబ్బు వివాదం ఘర్షణకు దారితీసింది. సీటీఎం రోడ్డు శివాజీ నగర్‌లో నివసించే రెడ్డి ప్రసాద్(24) తన తల్లిపై గొడవకు వచ్చిన వారిని అడ్డుకోగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. బాధితుడు స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

సంబంధిత పోస్ట్